అక్కినేని నాగ చైతన్య మరో విజయం సాధించాడు. సాయి పల్లవి హీరోయిన్ గా చైతన్య హీరోగా రూపొందిన లవ్ స్టోరీ భారీ విజయం సాధించింది. మొదటి నుండి ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ప్రేక్షకులలో ఉంది. దానికి తోడు లవ్ స్టోరీ పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఈరోజుల్లో ఏ చిత్ర ఓపెనింగ్స్ ను అయినా పాటలు డిసైడ్ చేస్తున్నాయి. తొలి వీకెండ్ తోనే అటు డొమెస్టిక్ మార్కెట్ లో, ఇటు ఓవర్సీస్ లో కూడా లవ్ స్టోరీ అంచనాలకు మించి పెర్ఫర్మ్ చేసింది.
ఈరోజు నుండి లవ్ స్టోరీ ఓటిటిలో స్ట్రీమ్ అవుతోంది. అంటే అధికారికంగా చిత్ర ఫుల్ రన్ ముగిసినట్లే. లవ్ స్టోరీ తన ఫుల్ రన్ లో దగ్గరగా 35 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఇది చాలా మంచి నెంబర్ అని చెప్పాలి. ముఖ్యంగా ఏపీలో టికెట్ ధరలు, రోజుకి మూడు షోస్ నేపథ్యంలో లవ్ స్టోరీ అందరికీ లాభాలు తెచ్చిపెట్టింది.
ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి లవ్ స్టోరీ ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా ఏషియన్ సినిమాస్ బ్యానర్ నిర్మించింది. పవన్ సిహెచ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.