మహానటి చిత్రంతో నేషనల్ అవార్డును అందుకున్న కీర్తి సురేష్ భిన్నమైన సినిమాల ఎంపికతో ముందుకు సాగుతోంది. గుడ్ లక్ సఖి వంటి ఫీమేల్ ఓరియెంటెడ్ స్పోర్ట్స్ డ్రామా చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట అంటూ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ లు చేస్తోంది. అలాగే అన్నాత్తే, భోళా శంకర్ వంటి చిత్రాల్లో హీరోలకు చెల్లెలి పాత్రలు సైతం పోషిస్తోంది. మల్టీ టాలెంటెడ్ అయిన కీర్తి సురేష్ కు వయోలిన్ అంటే ఆసక్తి ఎక్కువ.
ఆ సంగీత పరికరంపై కీర్తి సురేష్ కు పట్టుంది. పలు మార్లు తన ఫ్యాన్స్ కు వయోలిన్ వాయిస్తూ అలరించిన కీర్తి, సర్కారు వారి పాట కోసం కూడా వయోలిన్ వాయించనుందిట. నిన్న సోషల్ మీడియాలో సర్కారు వారి పాట సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ ను సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ పాట పాడుతుందా అని అడగ్గా, థమన్ “కచ్చితంగా వయోలిన్ అయితే వాయిస్తుంది” అని సమాధానమిచ్చాడు.
ఇది మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఆసక్తిని కలిగించింది. ఏప్రిల్ 1న సర్కారు వారి పాట విడుదల కానున్న విషయం తెల్సిందే. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.