మహానటి చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఆ సినిమా సాధించిన అద్భుత విజయంతో నాగ్ అశ్విన్ ప్రతిభ గురించి అందరూ మాట్లాడుకున్నారు. అలాంటి నాగ్ అశ్విన్ కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ప్రభాస్ తో సినిమాకు కమిటైన విషయం తెల్సిందే. ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబోలో సినిమాపై ఇప్పటికే చాలా రూమర్లు షికార్లు చేసాయి.
తాజా సమాచారం ప్రకారం నాగ్ అశ్విన్ ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక షాట్ డివిజన్ ను కూడా త్వరలోనే మొదలుపెట్టబోతున్నాడట. అయితే అంతకంటే ముందు కంప్లీట్ అయిన స్క్రిప్ట్ ను మరోసారి ప్రభాస్ కు ఫుల్ నరేషన్ ఇస్తాడని తెలుస్తోంది. నాగ్ అశ్విన్ ఇప్పటికే ఈ చిత్రం గురించి అంచనాలు భారీగా పెంచేసాడు. ఇది ప్యాన్ ఇండియా సినిమా కాదని ప్యాన్ వరల్డ్ సినిమా అని చెప్పి ప్రభాస్ అభిమానులను ఫుల్ ఖుషీ చేసేసాడు.
ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది మొదట్లో కానీ ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. అశ్వినీ దత్ నిర్మించనున్న ఈ చిత్రంలో అన్ని భాషలకు చెందిన నటీనటులు నటించే అవకాశముంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.