ఎన్టీఆర్ అంటే ఇష్టం అందుకే ఎన్టీఆర్ కోసమే జై లవకుశ చిత్రంలో నటించానని అంటోంది అందాల భామ నివేదా థామస్ . జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషించిన చిత్రం ” జై లవకుశ ” . ఈ సినిమాలో నివేదా థామస్ ఒక హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే . అయితే జైలవకుశ చిత్రంలో తన పాత్ర చిన్నదైనా కథలో కీలకమైన క్యారెక్టర్ కావడంతో చేసానని ఇక బ్రోచేవారెవరురా చిత్రంలో కూడా మంచి పాత్ర పోషిస్తున్నానని తప్పకుండా మీ అందరికి నచ్చుతుందని అంటోంది నివేదా థామస్ .
తెలుగులో చాలా సెలెక్టివ్ గా మంచి చిత్రాలను అంతకంటే మంచి పాత్రలను ఎంచుకుంటున్న ఈ భామ తాజాగా బ్రోచేవారెవరురా చిత్రంలో నటించింది . ఈనెల 28 న ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఆ సినిమా దాంతో మీడియా ముందుకు వచ్చింది నివేదా థామస్ . శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించారు .