Homeటాప్ స్టోరీస్క‌రోనాపై ప్ర‌ముఖుల షార్ట్ ఫిల్మ్‌!

క‌రోనాపై ప్ర‌ముఖుల షార్ట్ ఫిల్మ్‌!

క‌రోనాపై ప్ర‌ముఖుల షార్ట్ ఫిల్మ్‌!
క‌రోనాపై ప్ర‌ముఖుల షార్ట్ ఫిల్మ్‌!

ప్రపంచాన్ని వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి కరోనా వైర‌స్‌. దీని భారిన ప‌డిన‌ ఎంత మందికి పాజిటివ్ అని తేలిందో, ఎంత మంది మృత్యువాత ప‌డ్డారో చైనా ఇప్ప‌టికీ ఖ‌చ్చిత‌మైన లెక్క‌లు చెప్ప‌డం లేదు. దీంతో ఇత‌ర దేశాల్లో భయం నీడ‌న ప్ర‌జ‌లు బ్ర‌తుకీడుస్తున్నారు. ఇదిలా వుంటే మ‌న దేశంలో క‌రోనా కార‌ణాంగా ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. వారి స‌హాయార్థం సెల‌బ్రిటీలు, సినిమా స్టార్స్ ముందుకొస్తున్నారు. ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించే వీడియోల్ని విడుద‌ల చేస్తున్నారు.

ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి చిరంజీవితో పాటు చాలా మంది తార‌లు క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పించే వీడియోల్ని రూపొందించి విడుద‌ల చేశారు. తాజాగా క‌రోనా కేసులు దేశ వ్యాప్తంగా పెరుగుతుండ‌టంతో ప్ర‌ముఖ హీరోలు చిరంజీవి, అబితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌జ‌నీకాంత్‌తో పాటు ప‌లు వురు క్రేజీ తార‌లంతా క‌లిసి ఓ ల‌ఘు చిత్రాన్ని చేస్తున్నారు. `ఫ్యామిలి` పేరుతో రూపొందిస్తున్న ఈ వీడియోని సోనీ పిక్చ‌ర్స్‌లో సోమ‌వారం  రాత్రి 9 గంట‌ల‌కు టెలీకాస్ట్ చేయ‌బోతున్నారు.

- Advertisement -

ఇందులో చిరంజీవి, అబితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌జ‌నీకాంత్‌తో పాటు ర‌ణ్‌బీర్ క‌పూర్‌, అలియాభ‌ట్‌, ప్రియాంక చోప్రా త‌దిత‌ర‌లు క‌నిపించ‌బోతున్నారు. క‌రోనా ప‌ట్ల ప్ర‌జ‌లు ఎలాంటి జాగ్ర‌త్త‌గా వుండాలి?. ఇంట్లో వుంటూనే ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌నే విష‌యాల్ని స్టార్స్ ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నార‌ని తెలిసింది. ఈ లఘు చిత్రాన్ని ప్ర‌సూన్ పాండే వ‌ర్చువ‌ల్ టెక్నాల‌జీ ద్వారా రూపొందిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All