బిగ్ బాస్ లో ట్విస్ట్ లకు కొదవ ఉండదు. అయితే ఇప్పటికే జనాలు బిగ్ బాస్ నుండి ట్విస్ట్ లకు అలవాటు పడిపోయారు దాంతో ప్రతీసారి ట్విస్ట్ వర్కౌట్ అవ్వదు. కానీ ఈరోజు ఎపిసోడ్ లో నాగార్జున సహాయంతో బిగ్ బాస్ ట్విస్ట్ లో సస్పెన్స్ ను బాగానే మైంటైన్ చేయించాడు.
ఎప్పటిలానే నాగార్జున ఈరోజు ఎపిసోడ్ లో క్లాసులు తీసుకున్నాడు. ఎవరైతే తప్పు చేసారో వారిని సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నించాడు. బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్ లో తప్పు చేసిన గ్రీన్ టీమ్ రవి, శ్వేతా, లోబో, సంచాలకులుగా ఫెయిల్ అయిన సిరి, కాజల్ లకు గట్టిగా క్లాసులు పడ్డాయి. ముఖ్యంగా రవి ఎంత చెప్పినా బుకాయించడంతో నాగార్జున పిల్లో తెచ్చి దూది పీకించి మరీ చూపించాడు.
శ్రీరామ్ చంద్రకు కూడా ఆర్టిస్ట్ ల విషయంలో చేసిన కామెంట్స్ కు క్లాస్ పీకాడు. ఇక ఎన్నీ మాస్టర్ ఈ వారం చాలా సందర్భాల్లో కూల్ కోల్పోయారు. దాన్ని కూడా పాయింట్ అవుట్ చేసాడు నాగార్జున. ఆ తర్వాత ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్ కు పిలిచి ఈ రూమ్ లో ఉండటానికి అర్హులు కాని వారు ఎవరు అంటూ నాగార్జున ప్రశ్నించాడు. ఇందులో ఎక్కువగా లోబో, ప్రియాలకు ఓట్లు పడ్డాయి. వీరిద్దరికీ చెరో నాలుగు ఓట్లు రాగా మరోసారి కంటెస్టెంట్స్ కే అవకాశం ఇచ్చి ఒకరినే ఎంచుకోమన్నారు. లోబోకు తక్కువ ఓట్లు రావడంతో ప్రియా సేఫ్ అయ్యారు. ఇక్కడ లోబో ఎలిమినేట్ అంటూ కలరింగ్ ఇచ్చి చివరికి తనను సీక్రెట్ రూమ్ లోకి పంపిస్తున్నట్లు చిన్న ట్విస్ట్ ఇచ్చారు.