నాగ చైతన్య, సమంతలు విడిపోవడంపై టాలీవుడ్ షాక్ కు గురైంది. ఈ విషయంపై నాగార్జున ట్విట్టర్ లో తన స్పందన తెలియచేశారు. బహర్య భర్తల మధ్య జరిగినవి వ్యక్తిగతమని.. చై, సాం ఇద్దరు తనకు చాలా ఇష్టమని.. ఇద్దరికి దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా అని నాగ్ రాసుకొచ్చారు. సమంత తమ ఫ్యామిలీతో గడిపిన క్షణాలు మధురమైనవని అన్నారు నాగార్జున.
బరువెక్కిన హృదయంతో ఈ విషయం చెబుతున్నాను.. చై, సామ్ విడిపోవడం దురదృష్టకరం.. భార్య భర్తల మధ్య ఏమి జరిగినా అది వ్యక్తిగతమైనవి.. చైతన్య, సమంత ఇద్దరు నాకు ఇష్టమే.. ఆమెతో గడిపిన క్షణాలు ఎంతో అందమైనవి. ఎల్లప్పుడూ సమంత మా ఫ్యామిలీకి స్పెషల్ అని అన్నారు నాగ్. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నా అని.. వారిద్దరికీ నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ట్వీట్ చేశారు.
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 2, 2021