Homeన్యూస్పవన్ ఫ్యాన్స్ కు తీపి కబురు తెలిపిన తెలంగాణ సర్కార్

పవన్ ఫ్యాన్స్ కు తీపి కబురు తెలిపిన తెలంగాణ సర్కార్

పవన్ ఫ్యాన్స్ కు తీపి కబురు తెలిపిన తెలంగాణ సర్కార్
పవన్ ఫ్యాన్స్ కు తీపి కబురు తెలిపిన తెలంగాణ సర్కార్

టాలీవుడ్ ఇండస్ట్రీ విషయంలో తెలంగాణ సర్కార్ ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటుంది. ముఖ్యముగా పెద్ద సినిమాల రిలీజ్ విషయంలో బెనిఫిట్ షోస్ అనుమతి , షోస్ పెంచుకునే అవకాశం , అలాగే టికెట్స్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తుంటుంది. తాజాగా భీమ్లా నాయక్ రిలీజ్ విషయంలో కూడా సంతోషకర విషయం తెలిపింది. నైజాం లో రెండు వారాల పాటు ఐదు షో కు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.

ఈ ప్రకటన తో మేకర్స్ తో పాటు నైజాం డిస్టిబ్యూటర్స్ , థియేటర్స్ యాజమాన్యాలతో పాటు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మెగా అభిమానులకు నైజాం లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే వారంతా పెద్ద పండగల భావిస్తారు. రిలీజ్ కు రెండు రోజులు ఉందనగానే థియేటర్స్ ను ముస్తాబు చేయడం..భారీ కటౌట్స్ కట్టడం వంటివి చేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇక భీమ్లా విషయంలోనూ అలాగే చేస్తున్నారు. కొద్దీ సేపటి క్రితమే హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభమయింది. ఈ వేడుకకు చిత్ర నటి నటులు, సాంకేతిక వర్గం తో పాటు పలువురు చిత్రసీమ ప్రముఖులు హాజరయ్యారు.

- Advertisement -

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ మూవీ భారీ అంచనాల నడుమ ఈ నెల 25 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. వాస్తవానికి జనవరి సంక్రాంతి రేస్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసినప్పటికీ పలు కారణాల కారణంగా ఫిబ్రవరి 25 కు వాయిదా పడింది.  సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ అందించడం విశేషం. థమన్ మ్యూజిక్ అందించగా.. నిత్య మీనన్, సంయుక్త మీనన్లు హీరోయిన్లు గా నటించారు.

పవన్ ఫ్యాన్స్ కు తీపి కబురు తెలిపిన తెలంగాణ సర్కార్
పవన్ ఫ్యాన్స్ కు తీపి కబురు తెలిపిన తెలంగాణ సర్కార్
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All