సైలెంట్గా వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 1`. రాక్స్టార్ యష్ని పాన్ ఇండియా స్టార్ని చేసిన సినిమా ఇది. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో దేశ వ్యాప్తంగా రికార్డుల్ని సృష్టించిన ఈ చిత్రానికి తాజాగా సీక్వెల్ని రూపొందిస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2గా రాబోతున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.
తొలి భాగం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రెండవ భాగంపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఆ అంచనాలని దృష్టిలో పెట్టుకుని ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్తో దర్శకుడు ప్రశంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ్యాడ్మెన్ సంజయ్దత్ అధీరాగా నటిస్తున్నారు. ఇండియా ప్రధాని రమికాసేన్గా రవీనాటాండన్ కనిపించబోతున్నారు.
జూలైలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో షూటింగ్ స్పీడప్ చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం మైసూర్లో హీరో యష్, హీరోయిన్ శ్రీనిధి శెట్టిలపై పలు కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. అది పూర్తయిన వెంటనే చివరి పార్ట్ మొత్తం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తి చేస్తారట.