Homeటాప్ స్టోరీస్ఇంటి నుంచి పారిపోయిన పాన్ ఇండియా స్టార్‌!

ఇంటి నుంచి పారిపోయిన పాన్ ఇండియా స్టార్‌!

ఇంటి నుంచి పారిపోయిన పాన్ ఇండియా స్టార్‌!
ఇంటి నుంచి పారిపోయిన పాన్ ఇండియా స్టార్‌!

క‌న్న‌డంలో చిన్న హీరోగా వున్న య‌ష్ `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`తో అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు. కేఊవ‌లం ఒకే ఒక్క చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. గ‌త ఏడాది విడుద‌లైన ఈ చిత్రం దేశ  వ్యాప్తంగా సంచ‌నం సృష్టించింది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` ని తెర‌కెక్కిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్న రాఖీభాయ్ క ద‌శ‌లో ఇంటి నుంచి పారిపోయాడ‌ట‌. కేవ‌లం 300 వంద‌లతో బెంగ‌ళూరు చేరుకున్నార‌ట‌. న‌టుడు కావాల‌నే క‌ల‌తో ఇంటి నుంచి పారిపోయాడ‌ట‌. ఈ విష‌యాన్ని హీరో య‌ష్ స్వ‌యంగా వెల్ల‌డించారు. నేను ఇంటి నుంచి పారిపోయి బెంగ‌ళూరు వ‌చ్చేశా. త‌రువాత చాలా భ‌య‌ప‌డ్డా. అయినా అంతులేని ఆత్మ‌విశ్వాసంతో వుండేవాడిని. ఆ స‌మ‌యంలో త‌న వ‌ద్ద 300 మాత్ర‌మే వున్నాయ‌ని, తిరిగి వెళితే ఇంటికి రానివ్వ‌ర‌ని తెలుసు. అందుకే న‌టుడిగా నా అదృష్టాన్ని ప‌రీక్షించాల‌నుకున్నాన‌ని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

తిరిగి ఇంటికి వ‌స్తాన‌ని అమ్మా నాన్నా అనుకున్నారు కానీ నేను మాత్రం థియేట‌ర్‌లో న‌టించ‌డం మొద‌లుపెట్టా. అదృష్ట వ‌శాత్తు ఓ వ్య‌క్తి త‌న న‌ట‌న న‌చ్చి థియేట‌ర్‌కి తీసుకున్నాడు. అక్క‌డి నుంచి పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ డ‌బ్బులు సంపాదించ‌డం మొద‌లుపెట్టా. టీలు అందించ‌డం నుంచి ప్ర‌తీ ప‌ని చేశా. స్టేజ్‌పై న‌ట‌న చూసి అవ‌కాశం ఇచ్చారు` అని త‌న కెరీర్‌లో ఎదుర్కొన్న ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని య‌ష్ వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All