Homeటాప్ స్టోరీస్లాక్ డౌన్ లో అడివి శేష్ ఏం చేస్తున్నాడు?

లాక్ డౌన్ లో అడివి శేష్ ఏం చేస్తున్నాడు?

లాక్ డౌన్ లో అడివి శేష్ ఏం చేస్తున్నాడు?
లాక్ డౌన్ లో అడివి శేష్ ఏం చేస్తున్నాడు?

లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు అన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరగట్లేదు. అయితే ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ లో పనులు ఆపట్లేదు. సినిమా వాళ్ళు అయినా కానీ వర్క్ ఫ్రొం హోమ్ చేస్తూ తమ పనులు కానిచ్చేస్తున్నారు. అందులో ఎస్ ఎస్ రాజమౌళి ఉన్న విషయం తెల్సిందే. ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించిన ఎడిటింగ్ వర్క్స్, విఎఫ్ ఎక్స్ పనులు పూర్తవుతున్న విషయాన్ని ఇటీవలే రాజమౌళి వెల్లడి చేసిన విషయం తెల్సిందే. స్కైప్ కాల్ ద్వారా కనెక్ట్ అయ్యి ఎడిటింగ్ పనులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పుడు అదే కోవలో యువ నటుడు అడివి శేష్ కూడా ఉన్నారు. గూఢచారి, ఎవరు వంటి సినిమాల సక్సెస్ లతో తనదైన ముద్ర వేసిన అడివి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు సహ నిర్మాతగా ఉన్న విషయం తెల్సిందే. మేజర్ బొంబాయి బాంబు బ్లాస్ట్స్ లో ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రను బేస్ చేసుకుని తెరకెక్కుతున్న చిత్రం. దీని షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయినట్లు అడివి శేష్ తెలిపాడు. ప్రస్తుతం షూటింగ్ లు ఏం జరగట్లేదు కాబట్టి ఇప్పటివరకూ షూటింగ్ అయిన పోర్షన్ వరకూ ఎడిటింగ్ వర్క్ ను అడివి శేష్ పర్యవేక్షిస్తున్నాడు.

- Advertisement -

ఈ సినిమాకు అడివి శేష్ దర్శకుడు కాకపోయినా అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. మేజర్ ఎడిటింగ్ వర్క్స్ తో పాటు గూఢచారి సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్స్ తో కూడా అడివి శేష్ బిజీగా ఉన్నట్లు తెలిపాడు. గూఢచారి సినిమాకు కూడా అడివి శేష్ కథ, స్క్రీన్ ప్లే అందించాడు. దాని సీక్వెల్ పై చాలానే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అడివి శేష్ ఈ స్క్రిప్ట్ చాలా బాగా వస్తోందని తెలిపాడు. మొత్తంగా లాక్ డౌన్ అయినా కానీ అడివి శేష్ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All