Homeటాప్ స్టోరీస్అడివి శేష్ హిట్ మూవీ అక్క‌డికి వెళుతోందా?

అడివి శేష్ హిట్ మూవీ అక్క‌డికి వెళుతోందా?

అడివి శేష్ హిట్ మూవీ అక్క‌డికి వెళుతోందా?
అడివి శేష్ హిట్ మూవీ అక్క‌డికి వెళుతోందా?

విభిన్న‌మైన చిత్రాల్లో న‌టిస్తూ వరుస విజ‌యాన్ని ద‌క్కించుకుంటున్నారు యంగ్ హీరో అడివి శేష్‌. రెజీనాతో క‌లిసి ఆయ‌న న‌టించిన తాజా థ్రిల్ల‌ర్ `ఎవ‌రు`. రాంజీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఈ  చిత్రాన్ని పీవీపీ సినిమా బ్యాన‌ర్‌పై ప్ర‌సాద్ వి. పొట్లూరి నిర్మించారు. గ‌త ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి భారీ లాభాల్ని అందించింది.

స్పానిష్ చిత్రం `ది ఇన్విజిబుల్ గెస్ట్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అంత‌కు ముందే ఇదే కాన్సెప్ట్‌తో హిందీలో `బ‌ద్లా` చిత్రం రూపొందింది. అయితే ఆ చిత్రానికి పూర్తి భిన్నంగా తెలుగు రీమేక్‌ని చాలా మార్పులు చేసి రూపొందించారు. ఇక్క‌డ సూప‌ర్ హిట్‌గా నిలిచిన `ఎవ‌రు` చిత్రాన్ని త్వ‌ర‌లో క‌న్న‌డ‌లో రీమేక్ చేయ‌బోతున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -

క‌న్న‌డ యంగ్ హీరో దిగాంత్ ఇందులో న‌టించ‌నున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతుండ‌టంతో లాక్ డౌన్ విధించారు. దీని కార‌ణంగా సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. `ఎవ‌రు` క‌న్న‌డ రీమేక్ ని లాక్ డౌన్ త‌రువాత ప‌రిస్థితులని బ‌ట్టి ప్రారంభిస్తార‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All