విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ వరుస విజయాన్ని దక్కించుకుంటున్నారు యంగ్ హీరో అడివి శేష్. రెజీనాతో కలిసి ఆయన నటించిన తాజా థ్రిల్లర్ `ఎవరు`. రాంజీ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా బ్యానర్పై ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించారు. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించి భారీ లాభాల్ని అందించింది.
స్పానిష్ చిత్రం `ది ఇన్విజిబుల్ గెస్ట్` ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అంతకు ముందే ఇదే కాన్సెప్ట్తో హిందీలో `బద్లా` చిత్రం రూపొందింది. అయితే ఆ చిత్రానికి పూర్తి భిన్నంగా తెలుగు రీమేక్ని చాలా మార్పులు చేసి రూపొందించారు. ఇక్కడ సూపర్ హిట్గా నిలిచిన `ఎవరు` చిత్రాన్ని త్వరలో కన్నడలో రీమేక్ చేయబోతున్నట్టు తెలిసింది.
కన్నడ యంగ్ హీరో దిగాంత్ ఇందులో నటించనున్నాడట. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రబలుతుండటంతో లాక్ డౌన్ విధించారు. దీని కారణంగా సినిమా షూటింగ్లు ఆగిపోయాయి. `ఎవరు` కన్నడ రీమేక్ ని లాక్ డౌన్ తరువాత పరిస్థితులని బట్టి ప్రారంభిస్తారని తెలిసింది.