Homeగాసిప్స్ప్ర‌కాష్‌రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ప‌వ‌న్‌కు ఏమైంది?

ప్ర‌కాష్‌రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ప‌వ‌న్‌కు ఏమైంది?

ప్ర‌కాష్‌రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ప‌వ‌న్‌కు ఏమైంది?
ప్ర‌కాష్‌రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ప‌వ‌న్‌కు ఏమైంది?

జ‌న‌సేనాని ప‌వర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ప‌వ‌న్‌ని రంగులు మార్చే ఊస‌ర‌వెల్లితో పోలుస్తూ ప్ర‌కాష్‌రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఈ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌స్తుతం చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లో మంచి ఫైర్ వుంద‌ని, త‌ను మంచి లీడ‌ర్ అంటూ గ‌తంలో పొగ‌డ్త‌ల్లో ముంచేసిన ప్ర‌కాష్‌రాజ్ తాజాగా ప‌వ‌న్ ఓ ఊస‌ర‌వెల్లి అన‌డం సంచ‌ల‌నంగా మారింది. `ప‌వ‌న్‌కు ఏమైందో నాకు అర్థం కావ‌డం లేదు. ఆయ‌న విష‌యంలో చాలా నిరాశ‌కు గుర‌య్యాను. ప‌వ‌న్ ఓ లీడ‌ర్‌. ఆయ‌న‌కు ఓ పార్టీ వుంది. అలాంట‌ప్పుడు మ‌రో భుజం ఎందుకు ఎక్కారు?  అని ప్ర‌శ్నించారు ప్ర‌కాష్‌రాజ్‌.

2014లో బీజేపీని స‌పోర్ట్ చేశారు. గ‌త ఎ‌న్నిక‌ల్లో బీజేపీని ద్రోహి అన్నారు. ఇప్పుడు వాళ్లే మ‌ళ్లీ ఆయ‌న‌కు స‌హ నాయ‌కులుగా క‌నిపిస్తున్నారు. ఇప్ప‌టికీ 3-4 సార్లు మాట మార్చారు. అంటే ప‌వ‌న్ ఊస‌క‌వెల్లి అయివుండాలి.` అని ప‌వ‌న్‌పై ప్ర‌కాష్‌రాజ్ సంచ‌ల‌న విమర్శ‌లు చేశారు. జాతి హితం కోసం బీజేపీకి తాను మ‌ద్ద‌తు ఇస్తున్నాన‌ని ప‌వ‌న్ అంటే ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌న్నారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో బీజేపీ నాయ‌కుల మాట‌లు జాతి హితాన్ని కోరే విధంగా వున్నాయా?.. ఈ గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో తెలంగాణ ప్ర‌జ‌లు ప‌వ‌న్ కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వాల‌ని ప్ర‌కాష్‌రాజ్ ఘాటుగా స్పందించారు.

- Advertisement -

ఇదిలా వుంటే సీజ‌న్‌కో మాట మార్చ‌డంపై అన్ని వ‌ర్గాల్లో సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఉత్త‌రాది అహంకారం అంటూ బీజేపీపై నిప్పులు చెరిగిన ప‌వ‌న్ ఆ త‌రువాత బీజేపీకి మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం… బీజేపీ విధానాల‌ని పొగ‌డ‌డం సామాన్య ఓట‌ర్ల‌తో పాటు ఆయ‌న ఫ్యాన్స్‌కి అర్థం కావ‌డం లేదు. ఇంత‌కీ ప‌వ‌న్ కు ఏమైంది? .. ఆయ‌న ఎందుకిలా మాట మాట‌కి త‌న‌ స్టాండ్‌ని మారుస్తున్నాడు?.. అస‌లు తెర వెనుక బీజేపీ పెద్ద‌లు ఆడిన నాట‌కం ఏంటీ? .. ఎలా ప‌వ‌న్‌ని త‌మ బుట్ట‌లో ప‌డేశారు? .. దాని వెన‌కున్న క‌థేంటి?  అనే ప‌లు అనుమానాలు మొద‌ల‌య్యాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All