కరోనా దెబ్బకు వరల్డ్ వణికిపోతోంది. కంటికి కనిపించని వైరస్ కారణంగా భయంతో వణికిపోతోంది. ఎక్కడ చూసినా కరోనా మరణాలే.. కరోనా చర్చలే. ఏ దేశాన్నీ ఈ మహమ్మారి విడిచి పెట్టడం లేదు. దీని ధాటికి వేలకు వేలు కుప్పలు తెప్పలుగా మృత్యువాత పడుతున్నారు. ఇటలీలో మరీ దారుణం. ప్రజలు అక్కడ పిట్టల్లా రాలుతున్నారు. ఈ మరణాలని ఆపలేక ఇటలీ ప్రధాన మోరున విలపించడం ప్రపంచం మొత్తం ఆశ్చర్యంతో చూసింది.
అయితే కరోనా ఎఫెక్ట్ సినీ స్టార్స్, సెలబ్రిటీల వరకు దీని ప్రభావం పడింది. దీని కారణంగా చాల మంది సనిలేకుండా పోయారు. వారికి అండగా నిలవడానికి మాస్ చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ ముందుకొచ్చారు. కరోనా కారణంగా షూటింగ్లు బంద్ చేయడంతో నిత్యం పని వుంటే తప్ప జీవితం సాగించలేని సామాన్య కార్మికుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. దీంతో వారికి అండగా నిలవడం కోసం దర్శకుడు వి.వి.వినాయక్ 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు. దీనికి సంబంధించిన చెక్కుని నటుడు కాదంబరి కిరణ్కు అందజేశారు.
ఈ సందర్భంగా ఈ మొత్తాన్ని కారోనా కారణంగా పనిలేక ఇబ్బందిపడుతున్న పేద కళాకారులు, టెక్నీషియన్ల కుటుంబాలకు నిత్యావసర వస్తువులని అందించాలని ఈ సందర్భంగా వినాయక్ వెల్లడించారు. నిత్యావసర వస్తువులు కావాలనుకునేవారు మనం సైతం కాదంబరి కిరణ్ని సంప్రదించాలని స్పష్టం చేశారు.