కరోనా వైరస్.. ఇప్పుడు ఎవరిని కదిలించినా అందరినోట ఇదే మాట… వచ్చేస్తోంది వచ్చేస్తోంది. వైరల్గా వ్యాప్తిస్తోంది. ఈ నెల మొదటి వారం నుంచి జనం ఎక్కడ చూసినా ఇదే మంత్రం. అయిఏ కొంత సేపు దాన్ని మర్చిపోయండి.. శుభ సోమవారాన్ని ఆస్వాదించండి అంటోంది రామ్చరణ్ హీరోయిన్ నేహా శర్మ. `చిరుత` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నేహాశర్మ ఆ తరువాత తెలుగులో కనిపించకుండా పోయింది.
బాలీవుడ్కు మాత్రమే పరిమితమైపోయింది. అక్కడ అవకాశాలు అంతంత మాత్రమే వుండటంతో ఆడియన్స్ని ఎట్రిక్ట్ చేయడం కోసం గ్లామర్ షోలతో ఆకట్టుకోవడం మొదలుపెట్టింది. సోషల్ మీడియా ట్విట్టర్, ఇన్ స్టాని తన గ్లామర్ షోకు కేరాఫ్ అడ్రస్గా మార్చుకుంది. వరుస ఫొటోలతో ఇంటర్నెట్నిహీటెక్కించడం మొదలుపెట్టింది.
తాజాగా కరోనా వైరస్ కారణంగా జనం నిత్యం దీనిపైనే దృష్టిపెట్టడంతో తనని ఎవరూ పట్టించుకోవడం లేదనుకుందో ఏమో కానీ మరోసారి హాట్ షోతో రెచ్చిపోయింది. ప్రస్తుతం వున్న మ్యాడ్నెస్ నుంచి కొంచెం దృష్టి మరల్చండి. అందరికి హ్యాపీ సోమవారం. ఇంట్లోనే వుండండి.. సురక్షితంగా వుండండి` అని ఓ హాట్ పిక్ని జత చేసి సోషల్ మీడియా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో వైరల్గా మారింది.