యాక్షన్ చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్ను హీరోగా పరిచయం చేస్తూ `సీనయ్య` పేరుతో ఓ సినిమా మొదలైన విషయం తెలిసిందే. `శరభ` చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఎన్. నరసింహారావు ఈ చిత్రానికి దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. పిరియాడిక్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలనుకున్నారు. దీని కోసం వినాయక్ని సమూలంగా మార్చేశారు. బరువు తగ్గించారు. ఫైనల్గా హీరో లుక్లోకి తీసుకొచ్చారు.
కార్మిక లీడర్గా ఇందులో వినాయక్ పాత్రని మలిచారు. కొంత వరకు షూటింగ్ కూడా జరిగింది. వినాయక్కు సంబంధించిన ఫస్ట్లుక్ని కూడా రిలీజ్ చేశారు. సినిమాకు సంబంధించిన అఫీషియల్
ప్రెస్మీట్ ఉంటుందని అంతా భావించారు కట్ చేస్తే ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ బయటికి రాలేదు.
అయితే దర్శకుడు నరసింహారావు కారణంగానే ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది. వినాయక్కు, దర్శకుడు నరసింహారావుకు మధ్య అభిప్రాయ భేదాల కారణంగా సినిమాని ఆపేశారని, ఔట్పుట్ విషయంలోనూ సంతృప్తిగా లేకపోవడంతో ఈ సినిమాని ఆపేయడమే బెటర్ అని భావించారని ఫిల్మ్ సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి. కొంత మంది మాత్రం సినిమా ఆగలేదని బ్రేకిచ్చారని చెబుతున్నారు. దిల్ రాజు క్లారిటీ ఇస్తే కానీ `సీనయ్య` పరిస్థితి ఏంటన్న విషయంలో స్పష్టత రాదు.