ఇటీవల మలయాళంలో సూపర్హిట్లుగా నిలిచిన చిత్రాలన్నింటినీ తెలుగులో రీమేక్ చేయాలని నిర్మాతలు పోటీపపడుతున్నారు. ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ నటించి రూపొందించిన `లూసీఫర్` తెలుగులో రీమేక్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇదే హీరో నటించిన మరో హిట్ చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్` కూడా తెలుగులో రీమేక్ కానుంది. `లూసీఫర్` చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయబోతున్నారు.
`అయ్యప్పనుమ్ కోషియుమ్` చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ రీమేక్ చేస్తున్నారు. ఇదే నిర్మాత తాజాగా మరో మలయాళ హిట్ సినిమా రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. అదే `కప్పెల`. విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ సంచలన విజయాన్ని సాధిస్తే తెలుగులో దర్శకుడు తరుణ్ భాస్కర్కు, మహేష్ ఫ్యాన్స్కు మధ్య వివాదాన్ని సృష్టించింది.
ఇప్పుడు ఈ చిత్ర రీమక్లో విశ్వక్సేన్ నటించబోతున్నారట. ఇప్పటికే సితార ఎంటర్టైన్మెంట్స్ వర్గాలు విశ్వక్సేన్ని సంప్రదించాయని, ఇంకా అతని నుంచి సిగ్నల్ రాలేదని తెలిసింది. ప్రస్తుత పరిప్థితుల్లో ఈ రీమేక్కు విశ్వక్సేన్ బెస్ట్ ఛాయిస్ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ భావిస్తున్నారట. మరి విశ్వక్సేన్ ఏమంటారో చూడాలి.