మెగాస్టార్ చిరంజీవి `సైరా నరసింహారెడ్డి` తరువాత ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై నిరంజన్రెడ్డి, రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దశలో వుంది. `ఆచార్య` పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా కనిపించనున్నారు.
ఇందులోని కీలక అతిథి పాత్రలో మెగాపవర్స్టార్ రామ్చరణ్ నటించనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది. పరిస్థితుల్లో మార్పు వచ్చిన తరువాతే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభించాలని చిరంజీవి, కొరటాల భావిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత చిరంజీవి మలయాళ హిట్ ఫిల్మ్ `లూసీఫర్` రీమేక్లో నటించనున్న విషయం తెలిసిందే.
సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీగా వుంది. సుకుమార్తో పాటు సుజీత్, రైటర్ సాయిమాధవ్ బుర్ర ఈ చిత్ర కథని తెలుగు నేటి విటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారు. ఫైనల్ స్క్రిప్ట్ని లాక్ చేశారు. ఈ చిత్రంలోని కీలక పాత్రలో ఖుష్బూ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే పృథ్వీరాజ్ సుకుమార్ పాత్రలో హీరో విజయ్ దేవరకొండ నటించనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర బృందం ఇప్పటికే హీరో విజయ్ దేవరకొండని సంప్రదించిందని చెబుతున్నారు.
దీనికి సంబంధించిన మరింత సమాచారం బయటికి రావాల్సి వుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది.