కోలీవుడ్లో జరిగిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు రణరంగాన్ని తలపించిన విషయం తెలిసిందే. తమిళ ఆర్టిస్ట్ ఆసోసియేషన్ కు పోటీకి దిగి శరత్కుమార్, రాధారవి ప్యానెల్ని చిత్తుగా ఓడించిన విశాల్ పాండవార్ కూటమి ఆ తరువాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సమాల మార్పులకు శ్రీకారం చుట్టింది. నాజర్ అధ్యక్షతన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు.
ఇదే ఊపుతో విశాల్ తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేశారు. వైరి వర్గం నటుడు, నిర్మాత ఇసారి గణేష్ కోర్టుని ఆశ్రియంచడంతో ఎన్నికల ఫలితాల్ని రద్దుచేసి చెన్పై హైకోర్టు సంచలన తీర్పుని వెలువరించింది. అప్పటి నుంచి తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రత్యేక అధికారి కనుసన్నల్లో కార్యకళాపాలు నిర్వమిస్తోంది. తాజాగా రాష్ట్ర హైకోర్టు జూన్ 21 న తిరిగి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తీర్పు చెప్పడంతో మళ్లీ తమిళ ఇండస్ట్రీలో రణరంగానికి తెరలేచింది.
ఈసారి కూడా పోటీపడాలని విశాల్ వర్గం సర్వసన్నద్దం అవుతోందని తెలిసింది. జూన్ 21న జరపాలనుకున్న ఎన్నికలని కరోనా కారణంగా సెప్టెంబర్ వరకు వాయిదా వేయాలని కొంత మంది నిర్మాతలు హైకోర్టుని ఆశ్రయించారట. దీంతో వారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం సెప్టెంబర్ 30 లోగా నిర్మాతల మండలి ఎన్నికల్ని నిర్వహించాలని సూచించడంతో మళ్లీ విశాల్ వర్గం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.