కోలీవుడ్తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్ని తన సినిమాలతో ఆకట్టుకుంటున్న హీరో విశాల్. సైబర్ క్రైమ్ థ్రిల్లర్ `అభిమన్యుడు` చిత్రంలో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విశాల్ అదే చిత్రానీకి సీక్వెల్గా చేసిన చిత్రం `చక్ర`. ఎం.ఎస్. ఆనందన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్పై నిర్మించిన ఈ చిత్రంలో `జెర్సీ` ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించగా కీలక పాత్రలో రెజీనా కసాండ్ర నటించింది.
పరమవీర చక్ర మెడల్ చుట్టూ సాగే సైబర్ క్రైమ్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర స్నీక్పీక్ని టీజర్ని చిత్ర బృందం విడుదల చేసింది. `ఆవేశపడాల్సిన చోట ఆలోచిస్తున్నాం.. ఆలోచించాల్సిన చోట ఆవేశపడుతున్నాం` అంటూ విశాల్ చెబుతున్న డైలాగ్లు ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేస్తున్నారు. ట్రిడెంట్ ఆర్ట్స్ అధినేత కారణంగా రిలీజ్ చిక్కుల్లో పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఆ చిక్కుల్ని అధిగమించి మొత్తానికి థియేటర్లలో సందడ చేయబోతోంది. ఈ మూవీపై హీరో విశాల్ భారీ అంచనాలు పెట్టుకున్నారట.