మాస్ మహారాజా రవితేజ, ఎస్ ఎస్ రాజమౌళి, అనుష్క… వీరందరి కెరీర్స్ లో చాలా ముఖ్యమైన చిత్రం విక్రమార్కుడు. ఈ సినిమా సాధించిన విజయంతో వీరందరి కెరీర్స్ మారిపోయాయి. విక్రమార్కుడు చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించాడు. విక్రమార్కుడు చిత్రానికి అటు తమిళ్ లో, ఇటు హిందీలో రీమేక్ అయి సూపర్ డూపర్ హిట్స్ సాధించాయి. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విక్రమార్కుడు హిందీ వెర్షన్ రోడీ రాథోడ్ కు సీక్వెల్ రెడీ చేస్తున్నానని చెప్పాడు.
ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు కేవలం హిందీ వెర్షన్ మాత్రమే కాకుండా తెలుగులో కూడా సీక్వెల్ వస్తోందిట. హిందీలో అక్షయ్ కుమార్, తెలుగులో రవితేజనే హీరోలుగా నటిస్తారు. అయితే ఎస్ ఎస్ రాజమౌళి మాత్రం ఈ సినిమాకు దర్శకత్వం వహించడు.
ప్రస్తుతం జక్కన్న రేంజ్ మారిపోయింది. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి ప్యాన్ ఇండియా చిత్రాలను డైరెక్ట్ చేస్తున్నాడు. దీని తర్వాత మహేష్ బాబుతో సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు.