మాస్ మహారాజా రవితేజ తన కెరీర్ లో ఎప్పుడూ లేనంత బిజీగా ఉన్నాడు. క్రాక్ తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ చిత్రం చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అలాగే దీని తర్వాత శరత్ మండవ అనే నూతన దర్శకుడు తెరకెక్కించే రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. వీటి తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో కూడా నటిస్తాడని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే రవితేజ కెరీర్ లో తొలిసారి ప్యాన్ ఇండియా చిత్రాన్ని అటెంప్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ను ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అన్నది తెలియదు కానీ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో నటిస్తాడని తెలుస్తోంది. స్టువర్టుపురం ప్రాంతంలో టైగర్ నాగేశ్వరరావు పేరు మోసిన గజదొంగ. ఈయన జీవిత కథలో జరిగిన ఆసక్తికర సంఘటనలను ప్రధాన పాయింట్ గా తీసుకుని సినిమాను రూపొందిస్తారు.
వచ్చే ఏడాది ఈ చిత్రం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.