Homeటాప్ స్టోరీస్వెన్నెల కిషోర్‌తో వేణు ఊడుగుల వెబ్‌సిరీస్‌!

వెన్నెల కిషోర్‌తో వేణు ఊడుగుల వెబ్‌సిరీస్‌!

వెన్నెల కిషోర్‌తో వేణు ఊడుగుల వెబ్‌సిరీస్‌!
వెన్నెల కిషోర్‌తో వేణు ఊడుగుల వెబ్‌సిరీస్‌!

`నీది నాది ఓకే కథ` చిత్రంతో వేణు ఉడుగుల దర్శకుడిగా త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. తొలి సినిమాతో ద‌ర్శ‌కుడిగా బ‌ర్నింగ్‌ పాయింట్‌ని చ‌ర్చించి విమ‌ర్శ‌ల ప్ర‌శంస‌లు అందుకున్నారు. తొలి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు. ప్ర‌స్తుతం ఓ స్ఫూర్త‌వంత‌మైన క‌థ‌తో ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల `వ‌రాట‌ప‌ర్వం` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.

రానా, సాయి ప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. 90వ ద‌శ‌కంలో ఉత్త‌ర తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్‌కి ముందే వేణు ఊడుగుల `ఆహా` ఓటీటీ కోసం చ‌లం మైదానం ని  వెండితెర‌పైకి తీసుకొస్తున్నారు. గ్రేట్ క్రూ వ‌ర్క్ చేస్తున్న ఈ వెబ్ ఫిల్మ్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

- Advertisement -

ఇదిలా వుంటే ఈ వెబ్ ఫిల్మ్ తో పాటు వేణు ఊడుగుల మ‌రో వెబ్ సిరీస్‌ని కూడా తెర‌పైకి తీసుకురాబోతున్నారు. ఇందులో వెన్నెల కిషోర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ని తెలిసింది. ఇందుకు సంబంధించిన చర్చలు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది. దీనికి వేణు ఊడుగుల వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన ఓ వ్య‌క్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All