Homeటాప్ స్టోరీస్2020 ఓ వ‌ర‌స్ట్ ఇయ‌ర్ - వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌

2020 ఓ వ‌ర‌స్ట్ ఇయ‌ర్ – వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌

2020 ఓ వ‌ర‌స్ట్ ఇయ‌ర్ - వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌
2020 ఓ వ‌ర‌స్ట్ ఇయ‌ర్ – వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌

2020 ఓ వ‌ర‌స్ట్ ఇయ‌ర్‌గా మారుతోంది. మ‌రో లెంజెండ‌రీ న‌టుడు రిషిక‌పూర్ స‌ర్ మ‌న‌ల్ని విడిచి వెళ్లిపోయారు. స‌ర్ మిమ్మ‌ల్ని మ‌స్స‌వుతున్నాం` అని త‌మిళ న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ట్వీట్ చేసింది.  గురువారం ఉద‌యం లెజెండ‌రీ యాక్ట‌ర్ రిషిక‌పూర్ క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. గ‌త కొంత కాలంగా క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఈ రోజు ఉద‌యం ముంబైలోఇ ఓ ఆసుప‌త్రిలో తుది శ్వాస విడిచారు.

ఇక రిషి క‌పూర్ మృతిపై బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఆవేద‌న‌ని వ్య‌క్తం చేశారు. రిషి క‌పూర్ వెళ్లిపోయాడ‌న్న వార్త‌విని కుప్ప‌కూలిపోయాన‌న్నారు. `రిషిక‌పూర్ లేర‌నే వార్త నాలో విధ్వంస‌క‌ర వేద‌న‌ని క‌లిగిస్తోంది. ఎంతోమంది హృద‌యాలు గెల్చుకున్న అద్భుత న‌టుడు. నా స్నేహితుడు రిషిక‌పూర్‌కు తుది వీడ్కోలు అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

- Advertisement -

ఇది విషాద‌క‌రం ఇద్ద‌రు గొప్ప న‌టుల్ని త‌క్కువ స‌మ‌యంలోనే కోల్పోయాం అని వెంక‌టేష్ అన్నారు. ఇది మృద‌యం బ‌ద్ద‌ల‌య్యే విషాదం అని ర‌జ‌నీకాంత్‌ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ వారం చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర‌మైన ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి` అని మోహ‌న్‌బాబు అన్నారు. రిషిక‌పూర్‌గారు అఏర‌నే వార్త హృద‌యాన్ని క‌లిచి వేసింద‌ని రామ్‌చ‌రణ్ ట్వీట్ చేశారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All