టాలీవుడ్ హీరోలకి కొత్తగా పూనకం మొదలైందా? ఏడాదికి ఒకటి అర చిత్రాల్లో మాత్రమే నటించే స్టార్ హీరోలు ట్రేడ్ వర్గాలతో పాటు స్టార్ ప్రొడ్యూసర్స్ షాక్కు గురయ్యేలా వరుస సినిమాలతో స్పీడు పెంచేస్తున్నారు. ఈ రేసులో పవన్కల్యాణ్ ముందు వరుసలో వుండగా ఆ తరువాత స్థానంలో నేచురల్ స్టార్ నాని వున్నాడు. అదే లైన్లో నితిన్ వుండగా తాజాగా ఈ లిస్టులోకి మాస్ మహారాజా రవితేజ కూడా చేరిపోయాడు.
`డిస్కోరాజా` తన కెరీర్కు కొత్త ఊపునిస్తుందని కొండంత ఆశతో సినిమా చేసిన రవితేజ ఆ మూవీ డిజాస్టర్గా నిలవడంతో కొంత షాక్ కు గురైనా వెంటనే తేరుకుని వరుస చిత్రాల్ని అంగీకరిస్తూ షాకులిస్తున్నాడు. ప్రస్తుతం `క్రాక్` చిత్రాన్ని పూర్తి చేసేపనిలో వున్న రవితేజ ఆ వెంటనే రమేష్ వర్మతో కొత్త చిత్రాన్ని మొదలుపెట్టబోతున్నాడు.
ఇదిలా వుంటే ఈ రెండు చిత్రాలతో పాటు మరో ఇద్దరు దర్శకుల్ని ఓకే చేసినట్టు తెలుస్తోంది. `నేను లోకల్` ఫేమ్ త్రినాథరావు నక్కిన చెప్పిర పోలీస్ స్టోరీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన మాస్రాజా వక్కంతం వంశీకి తాజాగా ఓకే చెప్పడం అందరికి షాకిస్తోంది. అల్లు అర్జున్తో `నా పేరు సూర్య` చిత్రాన్ని రూపొందించి తొలి చిత్రంతోనే భారీ డిజాస్టర్ని సొంతం చేసుకున్నారు వక్కంతం వంశీ. అలాంటి అతనికి మరో సినిమా ఇవ్వడానికి హీరోలు జంకుతుంటే రవితేజ మాత్రం ఆఫర్ ఇవ్వడం నిజంగా గ్రేటే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.