బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం `ఉప్పెన`. వైష్ణవ్తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేస్తోంది. ఇక ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్తేజ్ తో సినిమా చేయాలని చాలా మంది పోటీ పడుతున్నారు.
అయితే ఈ పోటీలో ముందు వరుసలో నిలిచారు కింగ్ నాగార్జున. ప్రస్తుతంత టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్లో ఇప్పటికే ఓ చిత్రాన్ని పూర్తి చేసి షాకిచ్చిన వైష్ణవ్తేజ్ తాజాగా నాగార్జున హోమ్ బ్యానర్ `మనం ఎంటర్టైన్మెంట్స్కి తన మూడవ చిత్రాన్ని కమిట్ అయినట్టు తెలిసింది. కొత్త దర్శకుడు పృధ్వీ దర్శకత్వం వహించనున్న ఈ మూవీ త్వరలోనే ప్రారంభం కాబోతోంది.
ఇందులో విశేషం ఏంటంటే ఈ చిత్రానికి వైష్ణవ్తేజ్ ఏకంగా కోటి పారితోషికం తీసుకుంటున్నారట. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మానింది. అయితే బయటికి కోటి అని ప్రచారం జరుగుతున్నా సినిమా ఫలితాన్ని మట్టి నాగ్ హీరో వైష్ణవ్తేజ్ కు 3 కోట్ల వరకు పారితోషికం ఇచ్చే అవకాశాలే ఎక్కువగా వున్నాయని చెబుతున్నారు.