రామ్ గోపాల్ వర్మ `రంగీలా` చిత్రంలో ఉర్మిళా మంటోడ్కర్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్న ఉర్మిళ ఇటీవలే క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించింది. కాగ్రెస్ పార్టీలో చేరి 2019 మహారాష్ట్ర లో జరిగిన లోక్ సభ ఎలక్షన్లలో ముంబై కానిస్టెన్సీ నుంచి పోటీ చేసింది. ఆ తరువాత శివసేన పార్టీలో చేరింది.
తాజాగా ఉర్మిళ సోషల్మీడియా ఇన్ స్టా అకౌంట్ని హ్యాకర్స్ హ్యాక్ చేసి షాకిచ్చారట. ఈ నెల 15న ఇండియా ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 70వ వర్ధంతి సందర్భంగా ఊర్మిళ నివాళి అర్పిస్తూ పోస్ట్ పెట్టింది. ఆ తరువాత ఉర్మిళ ఇన్ స్టా అకౌంట్ హ్యాక్కు గురైందట. ఈ విషయాన్ని గమనించిన ఉర్మిళ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులకు, నెటిజన్స్కి వెల్లడించింది.
`నా ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ కు గురైంది` అని ఉర్మిళ తెలిపింది. తన అకౌంట్ని తిరిగి పొందడం కోసం ఊర్మిళ మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసుల్ని సంప్రదించింది. దీనిపై ఎఫ్ ఐ ఆర్ ని నమోదు చేసింది. దీంతో ఉర్మిళ ఇన్ స్టా న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.