`నాకు, నాతో పాటు మీ కుటుంబసభ్యులందరికీ ఇది చాలా సంతోషకరమైన దీపావళి. ఈ దీపావళికి దేవుడు మీకు శాంతి, శ్రేయస్సుని ఆనందాన్ని ప్రసాదిస్తాడు. దయచేసి గుర్తుంచుకోండి క్రాకర్స్ పేల్చకండి. పర్యావరణాన్ని రక్షించండి.. ఈ శుభ సందర్భంగా మీ ప్రియమైనవారితో సరదాగా గడపండి. దీపాలతో స్వీట్స్తో ఆనందించండి. జాగ్రత్త వహించండి ఆ దేవుడు మీ అందరినీ చల్లగా చూస్తాడు` అని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులని ఉద్దుశించి ట్వీట్ చేశారు. అయితే కోహ్లీ సలహా నచ్చని కొంత మంది నెటిజన్స్ అతన్ని ట్రోల్ చేశారు.
అనుష్క మీ కుక్కను అదుపులో పెట్టుకోండి అంటూ విమర్శలకు దిగారు. ఈ విమర్శలపై కాంగ్రెస్ నాయకుడు ఉదిత్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విరాట్ కోహ్లీని సపోర్ట్ చేస్తూనే వ్యంగ్యంగా స్పందించారు. కోహ్లీని అనుష్క పెంపుడు కుక్క అని పిలవడంలో ఎలాంటి తప్పులేదన్నారు. ఎందుకంటే కుక్కలే విధేయతను చూపిస్తాయని చమత్కరించారు. ఈ సందర్భంగా కోహ్లీపై విమర్శలు గుప్పించిన వారిని క్రూక్స్గా.. లోఫర్స్గా.. ఇడియట్స్గా అభివర్ణించారు.
`అనుష్క తన కుక్క విరాట్ కోహ్లీని నియంత్రించాల్సిన అవసరం లేదు. కుక్క కంటే ఎవ్వరూ నమ్మకమైన విశ్వాసమైన వారు కాదు. కాలుష్యం వల్ల మానవత్వం ప్రమాదంలో పడుతుందనే విషయంపై కోహ్లీ లోఫర్లు, క్రూక్స్ ఇడియట్స్ కు సలహా ఇచ్చారు. మంచి చెబితే విమర్శలు చేస్తారా అసలు మీరు ఈ దేశ అసలు వారసులేనా అని డీఎన్ ఏ పరీక్ష చేసుకోవాల్సిన అవసరముంది` అని ఘాటుగా ట్రోలర్స్కి కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది.