![భీమ్లా నాయక్ విషయంలో త్రివిక్రమ్ స్ట్రాటజీ ఇదే భీమ్లా నాయక్ విషయంలో త్రివిక్రమ్ స్ట్రాటజీ ఇదే](https://telugu.tollywood.net/wp-content/uploads/2021/08/trivikram-srinivas-behind-bheemla-naik-strategy.jpg)
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తోన్న సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోశియుమ్ కు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఒరిజినల్ లో బిజూ మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఇద్దరి పాత్రలకూ సమానమైన వెయిట్ ఉంటుంది. కానీ భీమ్లా నాయక్ విషయంలో అలా లేదు. పవన్ కళ్యాణ్ పేరునే సినిమా టైటిల్ గా పెట్టారు. దీన్ని బట్టే అర్ధమవుతోంది ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కే ఎక్కువ వెయిట్ ఉంటుందని.
అయితే ఇదంతా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ట్రాటజీగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను సంతృప్తి పరచడానికి రానా దగ్గుబాటి క్యారెక్టర్ ను తగ్గించేశారు. మల్టీస్టారర్ నుండి దీన్ని సోలో సినిమాగా మార్చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. సాగర్ కె చంద్ర దర్శకుడు అయినా కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూరుస్తున్నాడు.
ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.