ఈ మధ్య తెలుగు సినిమాల మేకింగ్ మారిపోతోంది. నేపథ్యం కూడా బాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో వుంటోంది. పేరుకు తెలుగు సినిమానే అయినా అంతా విదేశాల్లోనే నడుస్తోంది. అత్తారింటికి దారేది, అజ్ఞాత వాసి వంటి చిత్రాలని అత్యధిక భాగం ఫారిన్ నేపథ్యంలో నడిపించిన త్రివిక్రమ్ తాజా చిత్రాన్ని యుఎస్ నేపథ్యంలో నడిపించబోతున్నారట.
వివరాల్లోకి వెళితే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరపైకి రానున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై ఎస్. రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్రామ్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ని పూర్తి చేశారట త్రివిక్రమ్. ఈ మూవీ ని యుఎస్ నేపథ్యంలో అత్యధిగ శాతం షూట్ చేయాలని ప్లాన్ చేసినట్టు తెలిసింది.
అయితే ఈ మూవీని వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకురానున్నారట. అయితే ఏ నెలలో అన్నది మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ `ఆర్ ఆర్ ఆర్`లో నటిస్తున్న వియం తెలిసిందే. ఇటివలే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభించారు. ఎన్టీఆర్పై పలు కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది వరకు జరుగుతుందట. ఈ లోగా తను మహేష్తో సినిమా చేయాలని త్రవిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నారట.