మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండవ సారి కలిసి పనిచేయబోతున్నారు. `అరవింద సమేత` చిత్రం వీరిద్దరి తొలి కలయికలో రూపొందిన విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కల్యాణ్ రామ్, ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం కోసం బాలీవుడ్ క్రేజీ లేడీ జాన్వీ కపూర్ని త్రివిక్రమ్ మెయిన్ హీరోయిన్గా తీసుకోవాలని ఆమెని సంప్రదిస్తున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరపైకి రానున్న ఈ సినిమా ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని ఎస్. రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్నారు. ఓ పురాతన భవంతి నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు.
ప్రతీ చిత్రానికీ భారీ మొత్తాన్ని పారితోషికంగా తీసుకునే త్రివిక్రమ్ ఈ చిత్రానికి 20 కోట్లు తీసుకుంటున్నారట. ఎన్టీఆర్కు దాదాపు భారీ స్థాయిలోనే పారితోషికంతో పాటు లాభాల్లో వాటా ఇవ్వనున్నారట. కరోనా వైరస్ ప్రభావం తగ్గాక ఈ ఏడాది చివరలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభించే అవకాశం వుందని తెలిసింది.