సోమవారం బండ్ల గణేష్ వాయిస్ తో కూడిన ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఆడియో లో ఓ అభిమాని గణేష్ అన్న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా మాట్లాడబోతున్నావు..? నీ స్పీచ్ కోసం మీమంతా ఎదురుచూస్తున్నాం అని అనగా..దానికి ‘నన్ను భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్కు రాకుండా అడ్డుకుంటున్నారు.
నాకు రావాలని ఉన్నా త్రివిక్రమ్ రాకుండా చూస్తున్నారు. వైసీపీ నేతలతో కలిసి నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ గణేష్ రిప్లయ్ ఇచ్చినట్లు ఆడియో లో ఉంది. ఇంతే కాకుండా త్రివిక్రమ్ ఫై పలు కామెంట్స్ చేసినట్లు ఉండడం తో ఆడియో వైరల్ గా మారింది.
ఈ ఆడియో ఫై బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. నెట్టింట వైరల్ అవుతోన్న ఆడియో తనది కాదని కొట్టి పారేశారు. ఈ విషయంపై నేను స్పందించను అంటూ తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. బండ్ల గణేష్ మాట్లడకపోతే, ఈ ఆడియోను ఎవరు వైరల్ చేశారు.? అసలు బండ్ల గణేష్ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది.?
అన్న కోణంలో అంత మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటె భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక సోమవారం జరగాల్సి ఉండగా..ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మరణంతో రేపటికి వాయిదా వేశారు. రేపు సాయంత్రం 6 గంటలకు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ఏర్పటు చేయబోతున్నారు. మరి ఈ ఈవెంట్ కు గణేష్ వస్తాడా..? వస్తే ఎలాంటి స్పీచ్ ఇస్తాడనేది చూడాలి.