దేశ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందా అని ప్రాణాల్ని అరిచేతుల్లో పెట్టుకుని జీవిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ రోజు రోజుకి కరోనా సోకిన కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. జనతా కర్ఫ్యూకి మించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కర్ఫ్యూని విధించి కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టారు.
అయినా ప్రజలు రోడ్లపైకి వస్తుండం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా వుంటే కరోనా కట్టడికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సినీ రంగం అండగా నిలుస్తోంది. ఈ రోఉ ఉదయం పవన్కల్యాణ్ 2 కోట్లు విపత్తు కోసం సహాయ నిధికి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే హీరో రామ్చరణ్ 70 లక్షలు ప్రకటించారు. హీరోలు ప్రకటిస్తుంటే దర్శకులు కూడా మేము సైతం అంటూ ముందుకు వచ్చారు.
మాటల మాంత్రికుడు ఉభయ రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి 20 లక్షలు విరాళం ప్రకటించారు. అదే బాటలో యువ దర్శకుడు అనిల్ రావిపూడి, మరో దర్శకుడు కొరటాల శివ ఉభయ తెలుగు రాష్ట్రాలకు 5 లక్షలు, 5 లక్షలు ప్రకటించారు. ఈ పరంపరని యంగ్ హీరో నితిన్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.