మెగాస్టార్ చిరంజీవి `సైరా నరసింహారెడ్డి తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. కొణిదెల ఆర్ట్ ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై హీరో రామ్చరణ్, నిరంజన్రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా నక్సలైట్ నాయకుడిగా విభిన్నమైన పాత్రలో నటిస్తున్నట్టు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. సినిమా ప్రారంభం నుంచి ఈ చిత్ర టెక్నీషియన్స్ కారణంగా వార్తల్లో నిలిచిన ఈ చిత్రం ఆర్టిస్ట్ల విషయంలోనూ అదే తరహాలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది.
ఈ చిత్రంలోని కీలక అథిధి పాత్రలో రామ్చరణ్ నటిస్తాడని, ఈ పాత్ర నిడివి 30 నిమిషాలకు మించి వుంటుందని కొన్ని రోజులు ప్రచారం జరిగింది. ఆ తరువాత అదే పాత్రని మహేష్ చేయబోతున్నాడని వార్తలు షికారు చేశారు. ఆ తరువాత అతను కాదు రామ్చరణే ఆ పాత్రని చేస్తున్నాడని మరో వార్త వైరల్ అయింది. అయితే ఈ చిత్రంలోని కీలక పాత్రని మహేష్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్,
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో టాక్ బయటికి వచ్చింది. ఈ చిత్రంలో చిరుకు జోడీగా త్రిషని ఎంపిక చేశారని, ఈ వారం నుంచే అమెపై షూటింగ్ మొదలవుతుందని అన్నారు. అయితే టీమ్ మాత్రం ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. దీంతో ఈ సినిమా నుంచి త్రిష తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తనని ఇంత కాలం ఖాలీగా వుంచారని, ఎలాంటి ప్రకటన చేయడం లేదని ఫిలైన త్రిష ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్టు తాజా టాక్.