Homeటాప్ స్టోరీస్గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో త్రిష‌!

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో త్రిష‌!

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో త్రిష‌!
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో త్రిష‌!

రాజ్య‌స‌భ స‌భ్యులు జోగినిప‌ల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ‌సెల‌బ్రిటీల‌తో పాటు పొలిటిక‌ల్ లీడ‌ర్‌ల వ‌ర‌కు ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటూ మొక్క‌లు నాటుతున్నారు. తెలంగాణ స్టేట్ కే ప‌రిమిత‌మైన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గ‌త కొన్ని రోజులుగా ఢిల్లీకి కూడా పాకింది. ఇటీవ‌ల కేంద్ర మంత్రులు కూడా మొక్క‌లు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన విష‌యం తెలిసిందే.

తా.జాగా విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీక‌రించిన క్రేజీ స్టార్ హీరోయిన్ త్రిష త‌ను కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. శ‌ని‌వారం చెన్నైలోని త‌న నివాసంలో మొక్క‌లు నాటారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా న‌టి త్రిష్ వెల్ల‌డిచారు. దీనికి సంబంధించిన వీడియోని కూడా పోస్ట్ చేశారు.

వ‌తావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించ‌డం మ‌నంద‌రి బాధ్య‌త కాబ‌ట్టి నా బాధ్య‌త‌గా నేను ఈ రోజు మొక్క‌లు నాటాను అని  ఇందులో మీకు కూడా పాల్గోని మొక్క‌లు నాటాల‌ని అభిమానుల‌కు పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టి విజ‌య‌వంతంగా ముందుకు తీసుకుపోతున్న ఎంపీ జోగినిప‌ల్లి సంతోష్‌కుమార్ గారికి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All