Homeటాప్ స్టోరీస్మందు పార్టీలో కలుసుకున్న స్టార్ హీరోలు

మందు పార్టీలో కలుసుకున్న స్టార్ హీరోలు

tollywood top stars in one Frameజూలై 25 న దర్శకుడు వంశీ పైడిపల్లి పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వంశీ ఇచ్చిన మందు పార్టీలో కలుసుకున్నారు స్టార్ హీరోలు మహేష్ బాబు , ఎన్టీఆర్ , రాంచరణ్ లు . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇంతకుముందు ఎన్టీఆర్ , చరణ్ లు నటించగా తాజాగా మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్నాడు వంశీ తో . ఎన్టీఆర్ – వంశీ కాంబినేషన్ లో ” బృందావనం ” , చరణ్ – వంశీ కాంబినేషన్ లో ” ఎవడు ” చిత్రాలు రాగా రెండు కూడా సూపర్ హిట్స్ అయ్యాయి కట్ చేస్తే ఇప్పుడు మహేష్ బాబు వంశీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు .

ఇక ఈ దర్శకుడు పుట్టినరోజు కావడంతో పలువురు సినీ ప్రముఖులను పిలిచాడు ఆ వేడుకకు . అందులో మహేష్ బాబు , ఎన్టీఆర్ , చరణ్ లతో పాటుగా హీరోయిన్ పూజా హెగ్డే , దర్శకుడు కొరటాల శివ , నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు . ఇక వీళ్ళతో పాటుగా మరికొంతమంది ప్రముఖులు కూడా హాజరయ్యారు ఆ మందు పార్టీ కి . ఎన్టీఆర్ మహేష్ చరణ్ లకు మంచి అనుబంధం ఉంది దాంతో ప్రతీ వేడుకలో పాల్గొంటున్నారు ఈ ముగ్గరు . మొత్తానికి అగ్ర హీరోలు మందు పార్టీలో కలుసుకోవడం ఆ పిక్స్ బయటకు రావడం ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తే విషయమే ! అగ్ర హీరోలు విబేధాలు లేకుండా కలిసి పోతున్నారు కానీ హీరోల అభిమానులు మాత్రం ఒకరిపై ఒకరు కత్తులు దూస్తూ ఉంటారు మా హీరో గొప్ప అంటే లేదు లేదు మా హీరో గొప్ప అంటూ .

- Advertisement -

English Title:  tollywood top stars in one Frame

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All