Homeటాప్ స్టోరీస్థ‌ర్డ్ ఫిల్మ్ నిజంగా నన్ను ఇబ్బందుల్లో పెట్టింది!

థ‌ర్డ్ ఫిల్మ్ నిజంగా నన్ను ఇబ్బందుల్లో పెట్టింది!

థ‌ర్డ్ ఫిల్మ్ నిజంగా నన్ను ఇబ్బందుల్లో పెట్టింది!
థ‌ర్డ్ ఫిల్మ్ నిజంగా నన్ను ఇబ్బందుల్లో పెట్టింది!

`పెళ్లిచూపులు` చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకున్న దర్శకుడు త‌రుణ్ భాస్క‌ర్. రెండ‌వ చిత్రంగా ` ఈ న‌రానికి ఏమైంది` చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ మూవీ త‌రువాత విక్టరీ వెంక‌టేశ్‌తో భారీ చిత్రాన్ని చేస్తున్నానంటూ ప్ర‌క‌టించారు. ఈ మూవీ ప్ర‌క‌టించి కూడా ఏడాది కావ‌స్తోంది. గుర్ర‌పు పందాల నేప‌థ్యంలో ఈ మూవీని తెర‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేశారు.

కానీ అనుకోని కార‌ణాల వ‌ల్ల ఈ మూవీ ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది. ఇదిలా వుంటే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అఫీషియ‌ల్ న్యూస్ ఇంత వ‌ర‌కు బ‌య‌టికి రాలేదు కానీ త‌రుణ్ భాస్క‌ర్ ఈ మూవీ కోసం త‌న విలువైన స‌మ‌యాన్ని వేస్ట్ చేసుకోవాల్సి వ‌చ్చింది. దీంతో మ‌రింత స‌మ‌యం వేచ‌యి చూడడం ఇష్టం లేక త‌న మూడ‌వ ప్రాజెక్ట్‌ని ఈ రోజు ఇన్ స్టాలో ప్ర‌క‌టించారు త‌రుణ్ భాస్క‌ర్‌.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. `థ‌ర్డ్ ఫిల్మ్  నిజంగా నన్ను ఇబ్బందుల్లో పెట్టింది. భయము నన్ను దాదాపు చంపింది. రెండు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో దేన్ని ముందు ఎంచుకోల‌న్న విష‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకోడానికి ఇంత స‌మ‌యం ప‌ట్టింది.` అని తరుణ్ భాస్క‌ర్‌ తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నారు. తన తదుపరి చిత్రాన్ని తనను ఉత్తేజపరిచిన ఒక అంశంతో క్రైమ్ డ్రామా గా తెర‌కెక్కించ‌బోతున్నాన‌ని ప్ర‌క‌టించారు. త‌న‌కు న‌చ్చిన హీరోతో ఈ మూవీని చేయ‌బోతున్న‌డ‌ట‌. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని స్ప‌ష్టం చేశాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All