![సైబర్ పోలీసుల్ని ఆశ్రయించిన తరుణ్ భాస్కర్! సైబర్ పోలీసుల్ని ఆశ్రయించిన తరుణ్ భాస్కర్!](https://telugu.tollywood.net/wp-content/uploads/2020/07/Tarun-Bhaskar-strong-complaint-against-online-trolers.jpg)
మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. తనని సోషల్ మీడియాలో కొంత మంది ట్రోల్ చేస్తున్నారని, అసభ్య పదజాలంతో విమర్శిస్తున్నారంటూ గచ్చిబౌలీలోని సైబర్ క్రైమ్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఎస్. హరినాథ్కి ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ అనుదీప్, కృష్ణతేజ చౌదరిలకు సంబంధించిన ఫోన్ నంబర్లతో పాటు ట్విట్టర్ ఐడీలని కూడా ఈ పిటీషన్లో అందజేసినట్టు దర్శకుడు తరుణ్ భాస్కర్ వెల్లడించారు.
తరుణ్ భాస్కర్ ఇటీవల మలయాళ చిత్రం `కప్పెల` చూసిన తరువాత సినిమాపై ఓ వ్యాసాన్ని రాశారు. ఈ వ్యాసం తమ హీరో చిత్రాలని ఉద్దేశించే అని ఆగ్రహించిన మహేష్ ఫ్యాన్స్ తరుణ్ భాస్కర్ని టార్గెట్ చేస్తూ అనుదీప్, కృష్ణతేజ చౌదరిలు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ముందు లైట్ తీసుకున్న తరుణ్ భాస్కర్ విమర్శలు శృతిమించడంతో ఆగ్రహించిన తరుణ్ భాస్కర్ సదరు వ్యక్తులపై సైబర్ క్రైమ్ పోలీస్లకు కంప్లైంట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
ముందు ట్విట్టర్ అకౌంట్, ఫేస్ బుక్ ఐడీ నుంచి ఫోన్ నంబర్లు సేకరించి అనుదీప్, కృష్ణతేజ చౌదరిలతో పొలైట్గా మాట్లాడామని, అయితే వారి వాదన శృతిమించడం వల్లే విషయాన్ని సీరియస్గా పరిగణించి సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించామని, వారితో జరిపిన సంభాషణలకు సంబంధించిన వాయిస్ రికార్డులని కూడా పోలీసులకి సమర్పించామని తరుణ్ భాస్కర్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.