దర్శకుడిగా, రచయితగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్భాస్కర్ ఇటీవల `నీకు మాత్రమే చెప్తా` చిత్రంతో నటుడిగా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత వెబ్ సిరీస్లపై ప్రత్యేక దృష్టిపెట్టిన తరుణ్భాస్కర్ తాజాగా కొత్త అవతారం ఎత్తానే. `మనిషి బ్రతుకు ఇంతే` వెబ్ సిరీస్ కోసం రోల్ రైడాతో కలిసి ఓ పాట పాడటం ఆకట్టుకుంటోంది.
సిద్ధార్ధ్రెడ్డి, రేవంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ `మనిషి బ్రతుకు ఇంతే`. కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్పై వరుణ్రెడ్డి ఈ వెబ్ సిరీస్ని రూపొందించారు. తనలో కలిగిన డిప్రెషన్ నుంచి సిద్ధార్ధ్ అనే యువకుడి కథతో నడిచే నేటి కాలపు కామెడీ ఫిల్మ్ ఇది. సాధారణంగా డిప్రెషన్ను మన సినిమాల్లో చాలా భయంకరమైనదిగా చూపిస్తారు. కానీ దానికి వినోదాన్ని జోడించి రెండో కోణంలో కూడా చూపించొచ్చని మేమే నమ్మామని. ఈ సినిమా ద్వారా రెండవ కోణాన్ని చూపించాలనుకున్నామిన దర్శకుడు తెలిపాడు.
ప్రధానంగా ఆన్లైన్ ప్రేక్షకుల్ని ప్రధానంగా టార్గెట్ చేసుకుని ఈ ఫిల్మ్ తీశాం. పక్కా `రా` కంటెంట్తో ఆన్లైన్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ని అందించబోతున్నాం. అతి త్వరలోనే ఓ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేస్తాం` అన్నారు.