మిల్కీ బ్యూటీ తమన్నాకు మరోసారి అవకాశాలు బాగానే వస్తున్నాయి. రీసెంట్ గా సీటిమార్ సినిమాలో నటించింది. అది డీసెంట్ సక్సెస్ సాధించింది. ఇక తమన్నా, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన మరోసారి నటించే అవకాశం సంపాదించినట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి సైరా నరసింహా రెడ్డి సినిమాలో కనిపించింది. అయితే ఆ చిత్రంలో ఆమెది చిన్న పాత్రే. ఇక ఇప్పుడు చిరంజీవి చేయనున్న భోళా శంకర్ లో తమన్నా నటించనుంది.
మెహర్ రమేష్ ఈ చిత్రానికి డైరెక్షన్ చేస్తుండగా తమన్నాను కన్ఫర్మ్ చేశారట. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు. తమిళ సూపర్ హిట్ వేదాళం చిత్రానికి అధికారిక రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించనుంది. ఈ విషయాన్ని అధికారికంగా రాఖీ పండగ సందర్భంగా తెలియజేయనుంది.
చిరంజీవి భోళా శంకర్ తో పాటు ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలో కూడా నటిస్తోన్న విషయం తెల్సిందే. ఇక బాబీ దర్శకత్వంలో కూడా సినిమా చేయనున్నాడు.