ఈ మధ్య ప్రతీ సినిమా వివాదానికి తెర తీస్తోంది. కమ్యూనిటీలతో పాటు సామాజిక వర్గాలని హర్ట్ చేస్తున్నాయని విమర్శలు.. వివాదాలు తెరపైకొస్తున్నాయి. తాజాగా యువ దర్శకుడు స్వరూప్ ఆర్. ఎస్. జె మూవీ కూడా వివాదంలో చిక్కుకుంది. `ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ` చిత్రంతో స్వరూప్ ఆర్. ఎస్. జె దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న స్వరూప్ ఆర్. ఎస్. జె తాజాగా `మిషన్ ఇంపాజిబుల్` పేరుతో ఓ చిత్రాన్ని ప్రారంభించారు.
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి, అన్వేష్రెడ్డి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. శనివారం పూజా కార్యక్రమాలతో ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు. ఇదే సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇదే ఇప్పుడు వివాదానికి ప్రధాన కారణంగా నిలిచింది. Mission impossible లో sion ని తొలగించి ఆ Mishan impossibleగా మార్చారు.
ఇంత వరకు ఓకే.. ఫస్ట్ లుక్ పోస్టర్లో ముగ్గురు పిల్లలకు హిందూ దేశుళ్లైన హనుమంతుడు, శివుడు, శ్రీకృష్ణుడు గెటప్స్లలో చూపిస్తూ వారి చేతుల్లో తుపాకుల్ని పెట్టడం వివాదానికి దారి తీసింది. సోషల్ మీడియాలో మేకర్స్పై ప్రస్తుతం విమర్శల వర్షం కురుస్తోంది. హిందూ దేవుళ్లని కించపరిచారని మేకర్స్పై కేసులు పెట్టాలని ట్వీట్లు చేయడం వివాదానికి దారితీస్తోంది. దీంతో మేకర్స్ వివరణ ఇచ్చారు. ఉద్దేశ పూర్వకంగా ఈ పోస్టర్ని డిజైన్ చేయలేదని, జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, పోస్టర్ని వెనక్కి తీసుకుంటున్నామని వివరణ ఇచ్చారు. దీనికి నెటిజన్స్ నుండి సానుకూల స్పందన రాలేదు. పైగా మేకర్స్కి వ్యతిరేకంగా ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు.