స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకుడిగా పరిచయమైన చిత్రం `ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ`. వరుస హత్యలు.. మిస్సింగ్ కేసులని ఛేధించే డిటెక్టివ్ కథగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించి తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు స్వరూప్ ఆన్.ఎస్.జె. నవీన్ పొలిశెట్టి హీరోగా పరిచయమైన ఈ చిత్రం బాక్సీఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.
ఈ మూవీ తరువాత కొంత విరామం తీసుకున్న ఈ యంగ్ డైరెక్టర్ తాజాగా మరో విభిన్నమైన టైటిల్తో వినూత్నమైన కథతో మరో చిత్రాన్ని ప్రారంభించారు. స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిరంజన్రెడ్డి, అన్వేష్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ మూవీని శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ని కూడా ఇదే రోజు విడుదల చేశారు. మూడు పాత్రల చుట్టూ తిరిగే కథగా ఈ మూవీ వుంటుందని తెలుస్తోంది. హనుమంతుడు, శివుడు, శ్రీకృష్ణుడు గెటప్లలో వున్న ముగ్గురు కుర్రాళ్లు చేతుల్లో తుపాకులతో కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభం కాబోతోంది.