మెగాస్టార్ చిరంజీవి నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ సైరా నరసింహారెడ్డి మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అత్యధిక సెంటర్ లలో విడుదలవుతోంది. ఈ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి, సైరా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
ధ్రువ సినిమా విడుదలయ్యాక చరణ్ వచ్చి డాడీతో సినిమా చేస్తావా అని అడిగాడని, నేను ఒక యాక్షన్ స్టోరీ చేద్దామనుకుంటే సైరా కథ చేయాల్సి వచ్చిందని, పరుచూరి బ్రదర్స్ దగ్గరకి కథ వినమని చిరంజీవి గారు చెప్పారని, అయితే ఆ కథ విన్నాక, సైరా కథను నెక్స్ట్ లెవెల్లో రాసుకోవచ్చని అనిపించిందని, దాదాపు 9 నెలలు బోలెడంత రీసెర్చ్ చేసి ఈ కథను సిద్ధం చేశామని చెప్పుకొచ్చాడు సురేందర్ రెడ్డి.
మొత్తానికి ఏదైతేనేం, సైరా బోలెడన్ని అంచనాలతో థియేటర్లలో వాలిపోనుంది. మొత్తం ఐదు భాషలలో విడుదల కానున్న ఈ చిత్రం ఎంతమేరకు విజయం సాధిస్తుందనేది చూడాలి.