నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `జాతిరత్నాలు`. అనుదీప్ కె.వి. దర్శకత్వంలో స్వప్నసినిమా బ్యానర్పై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై అనూహ్య విజయాన్ని సాధిస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వసూళ్ల పరంగానూ ట్రేడ్ వర్గాలని విస్యానికి గురిచేస్తోంది.
ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని సూపర్స్టార్ కృష్ణతో కలిసి ప్రత్యేకంగా వీక్షించిన నటుడు నరేష్ `జాతిరత్నాలు` చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. సూపర్ స్టార్ కృష్ణతో కలిసి సినిమా చూస్తున్న ఫొటోని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
`సూపర్స్టార్ కృష్ణతో కలిసి జాతి రత్నాలు వీక్షించాను. ఆ సినిమా ఓ నవ్వుల బాంబు. భారీ వసూళ్లని సాధించిన చిత్రంగా ఖ్యాతిగడించినా ఆశ్చర్యపోనవసరం లేదు. కథానాయకుడు నవీన్ పొలిశెట్టి, దర్శకుడు అనుదీప్, నిర్మాత నాగ్ అశ్విన్ తో పాటు స్వప్న సినిమాస్ టీమ్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు` అని నరేష్ ట్విట్ఱర్లో తెలిపారు. ఈ చిత్రంలో నరేష్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకు ఫాదర్గా నటించిన విషయం తెలిసిందే.
Watched Jathirathnaalu with the superstar. The film is a humour bomb. No wonder its an all time top grosser in its class. Congratulations to Naveen polisetti, dir anudeep prod nagaswin and team of Swapna cinema pic.twitter.com/qkDxTtxH0k
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 21, 2021