Homeటాప్ స్టోరీస్ఫైన‌ల్‌గా నాగ్ అశ్విన్ అప్‌డేట్ ఇచ్చాడు!

ఫైన‌ల్‌గా నాగ్ అశ్విన్ అప్‌డేట్ ఇచ్చాడు!

ఫైన‌ల్‌గా నాగ్ అశ్విన్ అప్‌డేట్ ఇచ్చాడు!
ఫైన‌ల్‌గా నాగ్ అశ్విన్ అప్‌డేట్ ఇచ్చాడు!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస భారీ చిత్రాల్ని లైన్‌లో పెట్టిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే అందులో `కేజీఎఫ్` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న `స‌లార్‌` మెరుపు వేగంతో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇక 3డీ ఫార్మాట్‌లో రూపొందుతున్న మైథ‌లాజిక‌ల్ మూవీ `ఆదిపురుష్‌` చిత్రీకర‌ణ ఇటీవ‌లే మొద‌లైంది. ఇదిలా వుంటే ఈ రెండు చిత్రాల‌కు ముందే ప్ర‌క‌టించిన నాగ్ అశ్విన్ – వైజ‌యంతీ మూవీ మాత్రం ఇప్ప‌టికీ స్టార్ట్ కాలేదు.

దీనిపై ఎలాంటి అప్‌డేట్ కూడా రాలేదు. దీంతో ఈ మూవీ ఎప్పుడు మొద‌ల‌వుతుందా? అని ప్ర‌భాస్ అభిమానుల్లో చిన్న‌పాటి క‌ల‌వ‌రం మొద‌లైంది. దీపికా ప‌దుకునే హీరోయిన్‌గా న‌టించ‌నున్న ఈ మూవీలో బాలీవుడ్ మెగా‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. సైన్స్ ఫిక్ష‌న్‌గా రూపొంద‌నున్న ఈ మూవీకి సంబంధించి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఎట్ట‌కేల‌కు అప్‌డేట్ ఇచ్చారు. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నాగ్ అశ్విన్ ప్ర‌భాస్‌తో మూవీ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు.

- Advertisement -

`గ్యాప్ రావ‌డం మా మంచికే అనిపిస్తోంది. మేం ముందే అన్న‌ట్లు ప్ర‌పంచ స్థాయి సినిమాని తీర్చి దిద్ద‌డానికి కావాల్సినంత స‌మ‌యం దొరికిన‌ట్ట‌యింది. `ఆదిపురుష్‌` రాముడి గురించి కాబ‌ట్టి ఆ చిత్రం దేశంలోని చిన్న‌చిన్న ప‌ట్ట‌ణాల‌కీ చేరువ‌వుతుంది. ఆ త‌రువాత మా సినిమా వస్తే మాకు మ‌రో 30 శాతం రీచ్ పెరిగిన‌ట్లే.. మా చిత్ర క‌థ‌.. స్క్రీన్‌ప్లే.. అందులోని ఆర్ట్ వ‌ర్క్‌.. ప్రతీదీ మ‌రో స్థాయిలో వుంటాయి. దాన్ని ఎలా చేయాల‌న్న‌ది ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు.

అందుకే క‌ళాద‌ర్శ‌కుడి నుంచి మొద‌లు.. ప్ర‌తి ఒక్క టెక్నీషియ‌న్ మ‌ళ్లీ స్కూల్‌కి వెళ్లిన‌ట్లుగా నేర్చుకుని మ‌రీ ప‌ని చేస్తున్నారు. ఇదీ ఆల‌స్యానికి ఓ కార‌ణంగా మారింది. క‌రోనా వ‌ల్ల `రాధేశ్యామ్‌` ఆల‌స్య‌మైంది. దాంతో అన్ని ప్రాజెక్ట్‌లు ఆల‌స్య‌మ‌య్యాయి. ఫిబ్ర‌వ‌రి – మార్చిలో చిత్రీక‌ర‌ణ ప్రారంభించాల‌నుకున్నాం. ఇప్పుడు జూన్ – జూలైలో మొద‌లుపెట్టేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం` అన్నారు. నాగ్ అశ్విన్‌.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All