పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ చిత్రాల్ని లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే అందులో `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న `సలార్` మెరుపు వేగంతో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక 3డీ ఫార్మాట్లో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్` చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. ఇదిలా వుంటే ఈ రెండు చిత్రాలకు ముందే ప్రకటించిన నాగ్ అశ్విన్ – వైజయంతీ మూవీ మాత్రం ఇప్పటికీ స్టార్ట్ కాలేదు.
దీనిపై ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. దీంతో ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందా? అని ప్రభాస్ అభిమానుల్లో చిన్నపాటి కలవరం మొదలైంది. దీపికా పదుకునే హీరోయిన్గా నటించనున్న ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించబోతున్నారు. సైన్స్ ఫిక్షన్గా రూపొందనున్న ఈ మూవీకి సంబంధించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఎట్టకేలకు అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగ్ అశ్విన్ ప్రభాస్తో మూవీ గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
`గ్యాప్ రావడం మా మంచికే అనిపిస్తోంది. మేం ముందే అన్నట్లు ప్రపంచ స్థాయి సినిమాని తీర్చి దిద్దడానికి కావాల్సినంత సమయం దొరికినట్టయింది. `ఆదిపురుష్` రాముడి గురించి కాబట్టి ఆ చిత్రం దేశంలోని చిన్నచిన్న పట్టణాలకీ చేరువవుతుంది. ఆ తరువాత మా సినిమా వస్తే మాకు మరో 30 శాతం రీచ్ పెరిగినట్లే.. మా చిత్ర కథ.. స్క్రీన్ప్లే.. అందులోని ఆర్ట్ వర్క్.. ప్రతీదీ మరో స్థాయిలో వుంటాయి. దాన్ని ఎలా చేయాలన్నది ఎవరికీ అర్థం కావడం లేదు.