`జాతిరత్నాలు` చిత్రంతో నవీన్ పొలిశెట్టి స్టార్ హీరోలా జాబితాలో చేరిపోయాడు. ఇటీవల అనుదీప్ కె.వి దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధిస్తూ వసూళ్ల పరంగా ట్రేడ్ వర్గాలనే విస్మయానికి గురిచేస్తోంది. ఈ సినిమాకు ముందు నవీన్ పొలిశెట్టి ఓ భారీ చిత్రాన్ని అంగీకరించాడు. అనుష్క ప్రధాన పాత్రలో రూపొందనున్న మహిళా ప్రధాన చిత్రమిది.
ఈ మూవీని యువీ క్రియేషన్స్ నిర్మించబోతోంది. అయితే `జాతిరత్నాలు` తరువాత హీరోగా భారీ క్రేజ్ని సొంతం చేసుకున్న నవీన్ పొలిశెట్టి కోసం అనుష్క స్క్రిప్ట్లో మార్పులు చేయాలనుకుంటున్నారట. `జాతిరత్నాలు` చిత్రంలో నవీన్ పెర్ఫార్మెన్స్ చూసిన తరువాత అతని పాత్రకున్న ప్రాధాన్యతని పెంచాలని, నవీన్ పాత్ర నిడివిని పెంచాలని భావిస్తున్నారట. ఇందు కోసం స్క్రిప్ట్లో మార్పులు చేస్తున్నారట.
దీనికి సంబంధించిన అప్ డేట్ త్వరలోనే అధికారికంగా బయటికి రానున్నట్టు తెలుస్తోంది. అన్నట్టు `జాతిరత్నాలు` ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఈ మూవీ భారీ వసూళ్లని సాధిస్తోంది. ఈ మూవీ సాధిస్తున్న వసూళ్లని చూసి ట్రేడ్ వర్గాలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారట. రానున్న రోజుల్లో ఈ మూవీ `ఉప్పెన` టాక్తో పాటు వసూళ్లని కూడా అధిగమించడం ఖాయంగా చెబుతున్నారు.