నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `జాతిరత్నాలు`. కె.వి.అనుదీప్ దర్శకత్వంలో స్వప్న సినిమా బ్యానర్పై దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫన్ రైడర్గా రూపొందిన ఈ చిత్రం ఈ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు తొలి షో నుంచే మంచి టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ అనిపించుకుంది.
నవీన్పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురూ థియేటర్లలో ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్నారు. దీంతో ఈ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లోనూ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా మంది ఈ చిత్ర బృందాన్ని, నటీనటుల్ని ప్రశంసలతో ముంతెత్తుతున్నారు. తాజాగా స్టార్ హీరో అల్లు అర్జున్ ఈ చిత్ర టీమ్ని ప్రత్యేకంగా అభినందించారు.
`నిన్న రాత్రి `జాతిరత్నాలు` చూశాను. ఇది హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లోకెళ్లా కడుపుబ్బా నవ్వించిన సినిమా ఇది. చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్. నవీన్ పొలిశెట్టి తన పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. రాహుల్ రామకృష్ణ బ్రిలియంగ్గా నటించాడు. సహజమైన నటనతో అలరించాడు` అన్నారు. ఇక ఫైనల్గా మీర ముఖ్యంగా దర్శకుడు ఎంటర్టైన్ చేసిన విధానం చూసి ఆయనపై గౌరవం పెరిగింది. బ్రేయిన్ స్విఛాఫ్ చేసి ఈ ఫన్ రైడ్ని ఎంజాయ్ చేయండి` అన్నారు అల్లు అర్జున్.
And last and the most important my respect to the director @anudeepfilm for entertaining everyone. Everybody “ switch off your brains , watch the movie and enjoy the funnnn “
— Allu Arjun (@alluarjun) March 12, 2021