నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `జాతిరత్నాలు`. అనుదీప్. కె ఈ చిత్రంద ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. స్వప్న సినిమా బ్యానర్పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.
ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురువారం ఫేస్ బుక్ ద్వారా విడుదల చేశారు. హీరో హీరోయిన్లు నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా, కమెడియన్ ప్రియదర్శి, డైరెక్టర్ అనుదీప్ తదితర యూనిట్ మెంబర్స్ ముంబైలోని ప్రభాస్ నివాసానికి వెళ్లి మరీ ఆయన చేతుల మీదుగా ట్రైలర్ని రిలీజ్ చేయించారు. నవీన్ పొలిశెట్టి `జోగీపేట – ముంబై` అంటూ ఓ వీడియోను రూపొందించి, తామెలా ప్రభాస్ను కలుసుకున్నామో వినోదాత్మకంగా చూపించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా హీరోయిన్ ని చూసి ప్రభాస్ ఆమేంటీ ఇంత పొడవుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ `టీజర్ నాకు బాగా నచ్చింది. ట్రైలర్ అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉంది. సూపర్బ్. ట్రైలర్ చూసి పదిసార్లు నవ్వానంటే సినిమా ఇంకెంత సేపు నవ్విస్తుందో ఊహించుకోవాల్సిందే. సినిమా అంతా హిలేరియస్గా ఉంటుందని అనుకుంటున్నాను. కోవిడ్ తరువాత ఫ్యామిలీ అంతా వెళ్లి హాయిగా నవ్వుకొంటూ ఎంజాయ్ చేసే సినిమా అనుకుంటున్నాను. డైరెక్టర్ అనుదీప్కు, యాక్టర్స్కు, ప్రొడ్యూసర్ నాగ్ అశ్విన్కు, ఎంటైర్ యూనిట్కు బెస్ట్ విషెస్ చెప్తున్నాను` అన్నారు.