సునీల్ హీరోగా నటించిన చిత్రం `ఉంగరాల రాంబాబు`. క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఈ చిత్రం ద్వారా మలయాళ ముద్దుగుమ్మ మియా జార్జ్ హీరోయిన్గా పరిచయమైంది. పరుచూరి కిరీటి నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. దీంతో మియా జార్జ్ తెలుగులో మరో సినిమా చేయలేదు. గత కొంత కాలంగా తమిళంలో వరుస విజయాల్ని దక్కించుకుటోంది.
ఇటీవల పృథ్విరాజ్ నటించి తెరకెక్కించిన `డ్రైవింగ్ లైసెన్స్` చిత్రంతో మరో హిట్ని తన ఖాతాలో వేసుకుంది. గత కొంత కాలంగా ఫ్యామిలీ ఫ్రెండ్, బిజినెస్మెన్ అశ్విన్ ఫిలిప్తో ప్రేమలో వున్న మియా జార్జ్ రీసెంట్గా సీక్రెట్ ఎంగేజ్మెంట్ చేసుకుందని తెలిసింది. కేరళలో ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారట.
పెళ్లికి మూహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలిసింది. సెప్టెంబర్లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు. రానా పెళ్లి తరహాలోనే వీరు కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బిని ఫాలోఅవుతున్నారట. కరోనా వైరస్ ప్రభావం ఇలాగే వుంటే అత్యంత సన్నిహితుల మధ్యే వివాహం చేసుకోవాలని, తగ్గితే ఆడంబరంగా జరుపుకోవాలని ప్లాన్లు చేస్తున్నారట.