Homeటాప్ స్టోరీస్సుజీత్ ఇప్పుడు ఏం చేస్తున్నట్లు?

సుజీత్ ఇప్పుడు ఏం చేస్తున్నట్లు?

Sujeeth to work with Ram Charan
Sujeeth to work with Ram Charan

సినిమా ఇండస్ట్రీ అంటేనే అంత. హిట్ వస్తే ఆకాశానికి క్షణాల్లో ఇమేజ్ తారాస్థాయికి చేరుకుంటుంది. అదే ప్లాప్ వస్తే ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. 24 ఏళ్ల వయసులో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసిన అనుభవం లేని సుజీత్ రన్ రాజా రన్ చిత్రం ద్వారా దర్శకుడైపోయాడు. కేవలం షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవంతో ఆ చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు. అంతే తొలి సినిమా విజయంతోనే ప్రభాస్ నుండి పిలుపొచ్చింది. అది కూడా బాహుబలి తర్వాత ప్రభాస్ నటించబోయే చిత్రం. భారీ కాన్వాస్, అత్యధిక బడ్జెట్.. ఇలా అన్నీ కలగలిపి సాహో చిత్రాన్ని తెరకెక్కించాడు.

సినిమా స్టోరీ పరంగా బానే ఉన్నా కథను హ్యాండిల్ చేయడంలో జరిగిన పొరబాటు వల్ల సినిమా ప్లాప్ అయింది. సుజీత్ దర్శకుడిగా ఫెయిల్ అంటూ కామెంట్లు పడ్డాయి. హిందీలో తప్ప మిగిలిన అన్ని భాషల్లో ఈ సినిమా ప్లాపైంది. అయితే సుజీత్ టాలెంట్ ను తక్కువ చేయడానికి లేదు. మరో ఆసక్తికర సబ్జెక్ట్ తో మన ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

సాహో ప్లాప్ తో మరోసారి చిన్న సినిమాల వైపు సుజీత్ వెళతాడని అనుకున్నారు కానీ ఈసారి కూడా భారీ బడ్జెట్ చిత్రాన్నే తెరకెక్కించబోతున్నాడట. ప్యాన్ ఇండియా లెవెల్లో కాదు కానీ తన తర్వాతి చిత్రాన్ని స్టార్ హీరోతోనే ప్లాన్ చేసినట్లు సమాచారం. మాకు అందిన సమాచారం ప్రకారం సుజీత్ రామ్ చరణ్ ను దృష్టిలో పెట్టుకుని ఒక లైన్ అనుకున్నట్లు, దాన్ని చరణ్ కు కూడా వినిపించినట్లు తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ విడుదల తర్వాత పూర్తి స్క్రిప్ట్ తో వస్తే కచ్చితంగా చేద్దామని చెప్పినట్లు సమాచారం. సో అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదే చరణ్ – సుజీత్ ల కాంబినేషన్ లో సినిమా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ – గీతా ఆర్ట్స్ కలిపి నిర్మించనున్నట్లు ప్రాధమికంగా అనుకున్నారని సమాచారం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All